Sarkaru Vaari Paata | దాదాపు రెండున్నరేళ్ళ తర్వాత మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆకలితో ఉన్న అభిమానులకు ఈ చిత్రం ఫుల్ మీల్స్ను పెట్టింది. ఈ చిత్రంలో మహేష్బాబు క్యారెక్టరైజేషన్, ఎనర్జీ గత చిత్రాలకు భిన్నంగా ఉంది. భారీ అంచనాలతో మే 12న విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ రివ్యూలను తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపిస్తుంది. మహేష్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా సర్కారు వారి పాట నిలిచింది. ఆర్ఆర్ఆర్ తర్వాత మళ్ళీ ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. లేటెస్ట్గానే ఈ చిత్రం అమెరికాలో 2మిలియన్ గ్రాస్ను క్రాస్ చేసింది. ఇటీవలే ఈ చిత్రం 100కోట్ల క్లబ్లో కూడా అడుగుపెట్టింది. ఈ క్రమంలో మేకర్స్ ప్రోమోను విడుదల చేశారు.
ఈ ప్రోమోలో మహేష్బాబు, వెన్నెల కిషోర్ మధ్య సాగే కామెడీ సీన్ను విడుదల చేశారు. లేటెస్ట్గా విడుదలైన ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. డు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ను సాధించి లాభాల్లోకి వస్తుందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సముద్రఖని ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. 14రీల్స్ ఎంటర్టైనమెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లతో కలిసి మహేష్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
Super🌟 @urstrulyMahesh & @KeerthyOfficial chemistry is winning hearts in the theaters ❤️
Book your tickets now for the #BlockbusterSVP 🔥
– https://t.co/gOuf7h3AhM#SVPMania #SVP #SarkaruVaariPaata @ParasuramPetla @MusicThaman @14ReelsPlus @GMBents pic.twitter.com/PcTqlVkEUP
— Mythri Movie Makers (@MythriOfficial) May 18, 2022