సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ మంచి ట్రీట్ కోసం ఎప్పుడా ఎన్నడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, మహేష్ తన ఫ్యాన్స్ కోసం అర్థరాత్రి 12 గంటలకే అదిరిపోయే అప్డేట్ ఇచ్చి స్టన్ చేశారు. బర్త్ డే బ్లాస్టర్ వీడియో ఆగస్ట్ 9 ఉదయం తొమ్మిది గంటలకు విడుదల అవుతుందని ముందుగా ప్రకటించినప్పటికీ చెప్పిన టైంకి కొన్ని గంటల ముందే విడుదల చేసి షాకిచ్చారు.
తాజాగా విడుదలైన వీడియోలో మహేష్ లుక్ సరికొత్తగా ఉండడంతో పాటు ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేస్తుంది. ఇందు మూలంగా యావన్ మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా.. అంటూ మహేష్ బాబు ఎంట్రీని అద్భుతంగా చూపించారు.ఇఫ్ టైగర్ టేక్స్ రాబిట్’ అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ అభిమానులకి పూనకం తెప్పిస్తుంది. ‘ఇఫ్ యూ మిస్ ద ఇంట్రస్ట్.. యువిల్ గెట్ యువర్ డేట్’ అంటూ విలన్ గ్యాంగ్కి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చాడు
.
ఇక ఎప్పటిలానే తనదైన మేనరిజాన్ని ప్రదర్శించాడు. ఇక కీర్తి సురేష్ .. ‘సర్ పడుకునే ముందు ప్రతిరోజు దిష్టి తీయడం మర్చిపోకండి’ అని చెప్పడం ఆకట్టుకోగా, చివరలో కీర్తి సురేష్ పెట్టుకున్న మల్లె పూలని చూస్తూ ‘ఏమోయ్ కిషోర్.. ఓ ఐదారు మూరలు ఉండవవి’ అంటూ మహేష్ పంచ్ వేయడం వీడియోలో చూపించారు.
పవర్ ప్యాక్ట్ వీడియో మాత్రం ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేస్తుంది. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట చిత్రం బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఉంటుందని, ఇందులో భారీ బ్యాంక్ కుంభకోణంలో ఇరుక్కున్న తండ్రిని కాపాడే కొడుకుగా మహేష్ ఈ సినిమాలో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తుంది.