మహేష్ బాబు-పరశురాం కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata). ఈ సినిమాలో విలన్గా సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. సముద్ర ఖని తెలుగుతో పాటు తమిళంలో పలు సినిమాల్లో నటించి అలరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్(Keerthy Suresh) హీరోయిన్గా నటిస్తున్నారు.
దుబాయ్ లో తొలి షెడ్యూల్ షూటింగును పూర్తి చేసిన సర్కారు వారి పాట టీమ్, ఆ తరువాత గోవాలో ఓ షెడ్యూల్ ను కూడా పూర్తిచేసింది. ఈ రెండు షెడ్యూల్స్ లోను భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. మహేష్ బాబు 2020లో సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
2021లో ని సర్కారు వారి పాట సినిమా తో రావాలని అనుకున్నాడు కానీ అది కరోనా కారణంగా వర్కవుట్ కాలేదు. 2022 సంక్రాంతి కి సర్కారు వారి పాట సినిమాలు విడుదల చేయాలని ఎంతగానో ప్రణాళికలు రచించాడు. అందరికంటే ముందుగానే మహేష్ విడుదల తేదీపై ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు
ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7న రానుందని ఎప్పుడైతే ప్రకటించారో ప్రణాళికలు పూర్తిగా మారాయి. సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) సినిమాను సంక్రాంతి పోటీ నుంచి తప్పించి సమ్మర్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. అది కూడా ఏప్రిల్ నెలలోనే ఎలాంటి పోటీ లేని సమయంలో సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.సాయంత్రం దీనిపై క్లారిటీ రానుంది.