సీనియర్ నటుడు శరత్బాబు సోదరుని తనయుడు ఆయుష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘దక్ష’. వివేకానంద విక్రాంత్ దర్శకుడు. తల్లాడ శ్రీనివాస్ నిర్మాత. ఈ సినిమా టైటిల్ లోగోను ఇటీవల తనికెళ్ల భరణి, శరత్బాబు విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఓ వినూత్నమైన కథతో తెరకెక్కించాం. తప్పకుండా తెలుగుప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’ అన్నారు. హీరో ఆయుష్కు ఈ చిత్రం శుభారంభాన్నందించాలని శరత్బాబు ఆకాంక్షించారు. ముంబయిలో యాక్టింగ్ కోర్స్ చేశానని, హీరో కావాలనే తన కల ఈ సినిమా ద్వారా నెరవేరుతుండటం ఆనందంగా ఉందని ఆయుష్ తెలిపారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాత పేర్కొన్నారు.