సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు బిజినెస్ ఎలా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా ఆయన వరస విజయాలతో దూసుకుపోతున్నాడు. దాంతో ఆయన సినిమాలపై అంచనాలు కూడా అలాగే పెరిగిపోతున్నాయి. దానికి తోడు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతుంది. తాజాగా సర్కారు వారి పాట సినిమా విషయంలో కూడా బిజినెస్ లెక్కలు బయ్యర్లను భయపెడుతున్నాయి. ఇండస్ట్రీని కుదిపేస్తోంది.. ట్రేడ్ వర్గాలు సైతం షాక్ అవుతున్నాయి.
ఇప్పటి వరకు కనీసం 20 శాతం కూడా షూటింగ్ జరగని సర్కారు వారి పాట అప్పుడే బిజినెస్ పూర్తి చేసుకుంటుండటం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఈ సినిమా 15 కోట్లకు అమ్ముడయినట్లు ప్రచారం జరుగుతుంది. ఆ ఏరియాలో 10 కోట్లు అంటేనే సంచలనం. అలాంటిది మహేష్ బాబు సినిమా ఇప్పుడు 15 కోట్లు బిజినెస్ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్, మహేష్ బాబు ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్థిక నేరాల నేపథ్యంలో ఈ సినిమా కథ సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు పరశురాం. ఇందులో మహేష్ బాబు తండ్రిగా మలయాళం హీరో జయరామ్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈయన అల వైకుంఠపురంలో సినిమాలో అల్లు అర్జున్ తండ్రిగా నటించాడు. ఇప్పుడు మహేష్ బాబు తండ్రిగా నటించబోతున్నాడు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. 2022 సంక్రాంతికి సర్కారు వారి పాట విడుదల కానుంది