Oscar 2025 | ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) ఈసారి ఆస్కార్ అవార్డులకు ఇండియా నుంచి అధికారికంగా ఎంపికైన సినిమా జాబితాను విడుదల చేసిన విడుదల చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నుంచి నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన ‘హోమ్బౌండ్’ అనే హిందీ చిత్రం బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ కింద ఎంపికైంది. అలాగే తెలుగు నుంచి పుష్ప 2 తో పాటు సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప, గాంధీ తాత చెట్టు, కుబేరా చిత్రాలు పోటీ పడబోతున్నాయి. అయితే కన్నప్ప, సంక్రాతికి వస్తున్నాం చిత్రాలు ఆస్కార్కి పోటీ పడుతుండటంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. తెలుగు ఇండస్ట్రీలో మంచి సినిమాలు దొరకలేదా నామినేట్ చేయడానికి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరోవైపు ఇప్పటి వరకు ఇండియా నుంచి కేవలం మూడు చిత్రాలు మాత్రమే ఆస్కార్ నామినేషన్స్ సాధించాయి. మదర్ ఇండియా (1957), సలాం బాంబే (1988), లగాన్ (2001). అయితే ఈ మూడు సినిమాలకు కూడా అవార్డు రాలేదు. అయితే ఈసారి అయిన ‘హోమ్బౌండ్’ ఆస్కార్ సాధిస్తుందని సినీ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.