Sandeep Reddy Vanga | కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ సందీప్ రెడ్డి వంగా దర్శించుకున్నారు. సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమాతో గతేడాది బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా విజయం సాధించిన సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని, తలనీలాలు సమర్పించారు. అనంతరం బయటకువచ్చి సెలబ్రిటీ పాయింట్ వద్ద వేచి చూస్తున్న ఫోటోగ్రాఫర్లకు పోజులిచ్చారు. ఇక కొందరు భక్తులు సందీప్ను గుర్తు పట్టి సెల్ఫీలు దిగారు. ఒక అభిమాని నెక్స్ట్ మూవీ ఎప్పుడు అని అడుగగా.. ప్రభాస్తో త్వరలో స్పిరిట్(Spirit) స్టార్ట్ చేయనున్నట్లు తెలిపాడు.
#SandeepReddyVanga had darshan today at Tirumala
Next #Prabhas garu toh #Spirit start avthundhi pic.twitter.com/M7izkIFGtG
— Suresh PRO (@SureshPRO_) March 6, 2024