వికాష్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ముఖచిత్రం’. విశ్వక్సేన్ కీలక పాత్రను పోషించారు. గంగాధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మించారు. ఈ నెల 9న విడుదలకానుంది. ఈ సందర్భంగా రచయిత సందీప్ రాజ్ మాట్లాడుతూ…నేను చదివిన కొన్ని వార్తల ఆధారంగా ఈ కథను సిద్ధం చేసుకున్నాను. నా అభిమాన దర్శకుడు బాలచందర్ రూపొందించిన ఓ సినిమా కూడా ఈ కథకు స్ఫూర్తినిచ్చింది.
ఒక ప్లాస్టిక్ సర్జన్ ప్రమాదంలో గాయపడిన తన ప్రియురాలి ముఖానికి మరొకరి ముఖాన్ని అమర్చుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది.అన్నారు. దర్శకుడు గంగాధర్ మాట్లాడుతూ…కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే మంచి సందేశాన్నిచ్చే సినిమా ఇది. 30 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. సినిమాలో చాలా ఆసక్తికర అంశాలుంటాయి. మేం ట్రైలర్ లో చూపించింది కేవలం పది నిమిషాల కంటెంట్ మాత్రమే. మిగతాది థియేటర్లో ఎంజాయ్ చేయాలి. ఈ సినిమాలో న్యాయవాది పాత్రలో విశ్వక్ సేన్ నటన ఆకట్టుకుంటుంది. అన్నారు.