సందీప్కుమార్, దీప్తివర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘ద్రోహి’. ‘ది క్రిమినల్’ ఉపశీర్షిక. విజయ్ పెందుర్తి దర్శకుడు. ఈ నెల 13న విడుదలకానుంది. అదే రోజు నేషనల్ సినిమా డే సందర్భంగా మల్టీఫ్లెక్స్లలో 112 రూపాయలకే టికెట్లను విక్రయిస్తామని చిత్ర బృందం పేర్కొంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమాలో క్రైమ్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు ఆసక్తికరమైన డ్రామా ఉంటుంది.
తప్పకుండా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు. చందు ఛార్మ్స్, మహేష్విట్ట తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనంత నారాయణ్, నిర్మాతలు: విజయ్ పెందుర్తి, శ్రీకాంత్ రెడ్డి, దర్శకత్వం: విజయ్ పెందుర్తి.