సందీప్ కిషన్ హీరోగా నటించిన సినిమా ‘మైఖేల్’. తమిళ నటుడు విజయ్ సేతుపతి, వరుణ్ సందేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మి శరత్కుమార్ నాయికలుగా నటించారు. రంజిత్ జయకోడి దర్శకుడు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ సంయుక్తంగా నిర్మించాయి. పూస్కూర్ రామ్మోహన్రావు, భరత్ చౌదరి నిర్మాతలు. నారాయణదాస్ కె నారంగ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 3న విడుదల కానుంది.
తాజాగా చిత్ర ట్రైలర్ను హీరో బాలకృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ…‘మా సినిమా ట్రైలర్ చూసి అదిరింది అని బాలకృష్ణ గారు మెచ్చుకున్నారు. మన పనిని అభిమానించే వారి కోసం ఎంతైనా శ్రమిస్తుంటాం. అలా కష్టపడి చేసిన చిత్రమే ఇది. నా కెరీర్లో అత్యధిక బడ్జెట్తో రూపొందింది. మనం గర్వపడే సినిమా అవుతుంది’ అన్నారు. వరుణ్ సందేష్ మాట్లాడుతూ…‘ఈ చిత్రంలో నేనొక కొత్త తరహా పాత్రలో కనిపిస్తాను. నా కెరీర్లో ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. సందీప్ అడగగానే క్యారెక్టర్ నచ్చి ఒప్పుకున్నాను. థియేటర్లో మా సినిమాను చూడండి’ అన్నారు. నిర్మాత భరత్ చౌదరి మాట్లాడుతూ…‘సినిమా కంటెంట్ పరంగా, అవుతున్న బిజినెస్ పరంగా మేము చాలా సంతృప్తిగా ఉన్నాము. మా టీమ్ కష్టం మీకు ట్రైలర్లో కనిపిస్తుంది’ అన్నారు.