సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఊరు పేరు భైరవకోన’. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ నాయికలుగా నటిస్తున్నారు. అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు వీఐ ఆనంద్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాత. ఈ సినిమా టీజర్ను ఆదివారం హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ…‘నా కెరీర్లో తొలిసారి చండీయాగం చేసి టీజర్ను విడుదల చేశాం. ఇలాంటి ఫాంటసీ అడ్వెంచర్ చిత్రాలంటే నాకు ఇష్టం. దర్శకుడు వీఐ ఆనంద్ మంచి స్నేహితుడు.
ఆయనతో మరోసారి కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా వినోదాన్ని అందిస్తూనే చాలా మంచి విషయాలను చెబుతుంది’ అని చెప్పారు. దర్శకుడు వీఐ ఆనంద్ మాట్లాడుతూ…‘ఒక యూనిక్ కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని రూపొందించాను. ఎంటర్టైన్మెంట్తో పాటు సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. ప్రొడక్షన్లో నిర్మాత ఎక్కడా రాజీ పడలేదు. ఒక కొత్త సినిమాను త్వరలో తెరపై చూస్తారు’ అని చెప్పారు. నిర్మాత రాజేశ్ దండా మాట్లాడుతూ…‘దర్శకుడు వీఐ ఆనంద్ తరహా ప్రత్యేకమైన కథనం, మేకింగ్తో సినిమా ఉంటుంది. టీజర్లో మీకు కనిపించిన భారీతనం ఆద్యంతం సినిమాలో ఆకట్టుకుంటుంది’ అన్నారు.