మాస్ పల్స్ను ఖచ్చితంగా అంచనా వేసి విజయాలు దక్కించుకోవడం సాధారణ విషయం కాదు. అందులో నిష్ణాతుడిగా పేరు తెచ్చుకున్నారు అగ్ర దర్శకుడు సంపత్నంది. ‘రచ్చ’ ‘బెంగాల్ టైగర్’ ‘గౌతమ్నందా’ ‘సీటీమార్’ వంటి చిత్రాలతో తెలుగు చిత్రసీమలో తనకంటూ కొత్త పంథాను సృష్టించుకున్నారాయన. నేడు సంపత్నంది జన్మదినం. ఈ సందర్భంగా ఆయన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. సాయిధరమ్తేజ్ కథానాయకుడిగా నటించనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కించబోతున్నది. వాణిజ్య అంశాలు కలబోసిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్వర్క్ మొత్తం పూర్తయిందని, త్వరలో సెట్స్మీదకు తీసుకొస్తామని చిత్రబృందం పేర్కొంది. గత ఏడాది ‘సీటీమార్’ చిత్రంతో సంపత్నంది చక్కటి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.