కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తుంది. రీసెంట్గా జై చిరంజీవ ఫేమ్ సమీరా రెడ్డి , ఆమె భర్త అక్షయ్ వార్డేతో పాటు పిల్లలకు కరోనా సోకింది. దీంతో అందరు క్వారంటైన్కు వెళ్లి వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకున్నారు. అయితే తాజాగా జరిపిన పరీక్షలో కరోనా నెగెటివ్ రావడంతో ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కరోనా నుండి కోలుకున్నప్పటికీ, స్వల్ప అనారోగ్యంతో ఉన్నానంటుంది సమీరా .
కరోనా నుండి నా కుటుంబం కోలుకున్నందుకు సంతోషిస్తున్నాను. మరోవైపు ప్రజలు పడుతున్న కష్టాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. గత రెండు నెలలుగా ఫిట్నెస్ ఫ్రైడేని పాటించడం నా కెంతో ఉపయోగపడింది. అందరం ఒకేసారి కరోనాతో పోరాడడం కష్టంగా అనిపించింది . ఇప్పటికి కాస్త బలహీనంగా ఉన్నాను.మళ్లీ పుంజుకునేందుకు యోగా, వాకింగ్ చేస్తూ పౌష్టికాహారం తీసుకుంటున్నాను. అందరు వ్యాయామం చేయండి. ఇంట్లో చేసే వాకింగ్ కూడా మన స్టామినా పెంచేందుకు దోహదపడుతుంది. మంచి ఆహారం తీసుకోవడి, హాయిగా నిద్రపోండి. దృడంగా ఉండాల్సిన సమయం ఇది. పాజిటివ్ శక్తిని పెంచుకోండి. నా కుటుంబంపై మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు అంటూ సమీరా తన పోస్ట్లో పేర్కొంది.