టాలీవుడ్ స్టార్ యాక్టర్లు సమంత (Samantha), విజయ్ దేవరకొండ (Vijay devarakonda) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఖుషీ (Kushi). లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రానికి శివనిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమా కొన్ని షూటింగ్ షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా.. విజయ్-శివనిర్వాణ టీం విరామం తీసుకుంది.
అయితే తాజాగా కొత్త షెడ్యూల్కు సంబంధించిన వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం నవంబర్ 15 నుంచి ఖుషీ షూటింగ్ మొదలు కానుంది. ఈ లోపు సమంత టైటిల్ రోల్ చేస్తున్న యశోద పెండింగ్ పనులను పూర్తి చేయనుందట. యశోద చిత్రం నవంబర్ 11న విడుదల కానుంది.
ఖుషీ చిత్రంలో ప్రముఖ కన్నడ నటుడు జయరాం, సచిన్ ఖడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్కు మంచి స్పందన వస్తోంది. విజయ్ దేవరకొండ-సమంత కలయికలో వస్తున్న తొలి సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Read Also : Mehreen Pirzada | ఐలాండ్లో విక్రాంత్తో మెహరీన్ ఫిర్జాదా.. కొత్త అప్డేట్ స్టిల్స్ వైరల్
Read Also : Harish Kalyan | జెర్సీ నటుడు హరీష్ కల్యాణ్ వెడ్డింగ్ డేట్, టైం వివరాలివే
Read Also : Balakrishna | సినిమాటిక్ స్టైల్లో నందమూరి బాలకృష్ణ తొలి కమర్షియల్ యాడ్.. వీడియో