Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత గతకొంతకాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో చేరి చికిత్స కూడా తీసుకుంది. త్వరలోనే తాను ఈ ఆటో ఇమ్యూన్ రుగ్మత నుంచి బయటపడతానని ధీమా వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సమంత ఆరోగ్యంపై రోజుకో వార్త వైరల్ అవుతూనే ఉంది. తాజాగా సమంత ఆరోగ్యం మరోసారి క్షీణించిందంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి.
అంతేకాదు చికిత్స కోసం దక్షిణ కొరియా వెళ్తున్నారంటూ పలు వెబ్సైట్లు, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో సమంత ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆ వార్తలపై నటి టీం స్పందించింది. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమంటూ కొట్టి పారేసింది. సమంత ఆరోగ్యంగా ఉన్నారని, ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేసింది.
కాగా, సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూనే ‘యశోద’ సినిమాలోని తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. హరి-హరిశ్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమా నవంబరు 11న ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో సమంత తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ అనే సినిమాలో నటిస్తున్నారు. కాగా, సమంత అనారోగ్యం కారణంగా చిత్ర షూటింగ్ వాయిదా పడింది.
#SamanthaRuthPrabhu is suffering from Myositis and she is taking Ayurvedic treatment for it. She is traveling to South Korea for further treatment.
She was already using Korean Skincare cosmetics only.#Samantha pic.twitter.com/DmTKSCgsGl
— Siva Prasanth (@Sivaprasanth5) November 29, 2022