అక్టోబర్ 2న సమంత- నాగ చైతన్య అఫీషియల్గా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా ఉండే ఇద్దరు సడెన్గా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించే సరికి అందరూ షాక్ అయ్యారు. అయితే వీరిద్దరు విడాకులు తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుందా అనే కారణం తెలుసుకోవడానికి అభిమానులు, మీడియా చాలా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విడాకుల అనంతరం తాను కృంగిపోయి చనిపోతానని అనుకున్నానని.. కానీ వాటి నుంచి తెరుకుని బలంగా మారానని.. ఇప్పుడు తనపై తనకు గౌరవంగా ఉందని చెప్పుకొచ్చింది సమంత.
ఇక ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డ్స్ వేడుకకు హాజరైన ఆమె.. ‘ఈటైమ్స్’తో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా తాను నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్, నాగచైతన్యతో విడాకుల వ్యవహారంపై స్పందించింది. విడాకుల విషయం గురించి చెప్పదలచుకున్నదంతా చెప్పేశానని స్పష్టం చేసింది. విడాకుల గురించి తనచుట్టూ ఎందరో ఎన్నో అనుకున్నారని, అప్పుడే దానిపై మాట్లాడాలని భావించి మాట్లాడేశానని తెలిపింది. కాబట్టి మళ్లీ మళ్లీ దాని గురించే మాట్లాడాలనుకోవట్లేదని ఆమె తేల్చి చెప్పింది.
ఇప్పటిదాకా మంచి పాత్రలు చేశానని, భవిష్యత్ లోనూ చేస్తానని, దాని కోసం కష్టపడి పనిచేస్తానని తెలిపింది. తాను చేయబోయే భవిష్యత్ ప్రాజెక్టులన్నీ ఒకదానికొకటి వేరువేరని ఆమె వ్యాఖ్యానించింది. కాబట్టి 2022 అంతా మజాయేనని చెప్పుకొచ్చింది. సమంత ‘యశోద’, ‘అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్’లకు పచ్చజెండా ఊపగా, బాలీవుడ్లోనూ పలు ప్రాజెక్ట్లు ఓకే చేసినట్లు సమాచారం. ‘పుష్ప’లో ఓ స్పెషల్ సాంగ్లో సామ్ మెరవనున్న విషయం తెలిసిందే.