సమంత కథానాయికగా నటిస్తున్న పాన్ఇండియా చిత్రం ‘యశోద’. హరి-హరీష్ దర్శకులు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెకండ్షెడ్యూల్ గురువారం మొదలైంది. నిర్మాత మాట్లాడుతూ ‘ఈ నెల 12 వరకు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తాం. సంక్రాంతి తర్వాత మూడో షెడ్యూల్ ఆరంభిస్తాం.మార్చి నెలాఖరుకు చిత్రీకరణ పూర్తవుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తాం’ అని తెలిపారు. మహిళా ప్రధాన ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వరలక్ష్మి శరత్కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీశర్మ, సంపత్రాజ్, శత్రు, మధురిమ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎం.సుకుమార్, మాటలు: పులగం చిన్నారాయణ, డా॥ చల్లా భాగ్యలక్ష్మి, సంగీతం: మణిశర్మ, సహనిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి, దర్శకత్వం: హరి-హరీష్.