Actress Samantha | తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆమె గత కొంతకాలంగా మయోసైటిస్తో ఇబ్బంది పడటం వల్ల సినిమాలకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చింది. అనారోగ్యంతో పోరాడుతున్న ఈ స్టార్ నటి సమంత ఎంతో బలంగా తిరిగి నిలదొక్కుకుంటుంది. తన ట్రీట్మెంట్లో భాగంగా కొద్దిరోజుల క్రితం భూటాన్లో ఆయుర్వేద చికిత్సను కూడా తీసుకుంది. సమంత పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని టాలీవుడ్ సినీ ఇండస్ట్రీతో పాటు ఆమె ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు. ఇక సమంత ఓ నటిగానే కాకుండా తనలో మంచి సేవాగుణం ఉందని కొందరికే తెలుసు. అయితే ఆమె తాజాగా పెట్టిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రీసెంట్గా ఒక స్కూల్లో జరిగిన స్పోర్ట్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లిన సమంత అక్కడ చిన్న పిల్లలతో కలిసి సరదాగా గడిపింది. ఇక పిల్లలతో కలిసి ఉన్న ఫొటోలను సమంత ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ.. ఒక పుస్తకం, ఒక పెన్ను, టీచర్, చిన్న పిల్లలతో మాత్రమే ప్రపంచాన్ని మార్చగలం అని క్యాప్షన్ ఇచ్చింది.
సమంత చివరగా విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించగా.. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరోవైపు.. సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘సిటడెల్’ (Citadel) వెబ్సిరీస్ కూడా త్వరలోనే స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది.