సమంత కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. వరలక్ష్మీశరత్కుమార్, ఉన్నిముకుందన్ కీలక పాత్రధారులు. తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘మహిళా ప్రధాన కథాంశంతో తెరకెక్కుతున్న థ్రిల్లర్ చిత్రమిది. యశోద ఎవరు? ఆమె పోరాటం ఎందుకోసమన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ నెల 6 నుంచి 24 వరకు సాగిన తొలి షెడ్యూల్లో హైదరాబాద్లో ప్రధాన తారాగణంపై కీలక ఘట్టాలను చిత్రీకరించాం. జనవరి ప్రథమార్థంలో తదుపరి షెడ్యూల్ను ప్రారంభిస్తాం. మార్చి నెలాఖరులోగా షూటింగ్ను పూర్తిచేస్తాం. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నాం. కన్నడ, మలయాళం, హిందీలోనూ సినిమాను విడుదలచేస్తాం’ అని తెలిపారు. రావురమేష్, మురళీశర్మ, సంపత్రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, మాటలు: పులగం చిన్నారాయణ, డా॥చల్లా భాగ్యలక్ష్మి.