టాలీవుడ్ టాప్ హీరోయిన్స్లో ఒకరిగా ఉన్న సమంత తెలుగులో ఏమాయ చేశావే సినిమాతో పరిచయమై కుర్రకారుని తన బుట్టలో పడేసుకుంది. ఈ సినిమా సమయంలోనే చైతూ కూడా సామ్ ప్రేమలో పడ్డాడు. అయితే అతడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత రీసెంట్గా విడాకులు ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. విడాకుల ప్రకటన తర్వాత సమంత పేరు మారుమ్రోగిపోయింది. ఆమెకు సంబంధించి ఎన్నో కథనాలు, రూమర్స్ వచ్చాయి.
అవేమి పట్టించుకోని సమంత తన కెరీర్ని చక్కగా మలచుకుంటుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తున్నారు సామ్. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ నవంబర్ 30న విడదులై వైరల్గా మారింది. ఇక మరోవైపు సమంత హాలీవుడ్ సినిమాలో నటించే ఆఫర్ సొంతం చేసుకుంది. యష్ రాజ్ ఫిలిమ్స్ సమంతతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కొత్త డైరెక్టర్ శాంతరూబన్ జ్ఞానశేఖరన్ డైరెక్షన్లో సమంత ఓ చిత్రాన్ని చేయనున్నారు.
శ్రీదేవి మూవీస్ బ్యానర్పై ఓ కొత్త చిత్రం చేస్తున్నారు సమంత. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సినిమాను హరీష్ నారయణ్, హరి శంకర్ దర్శకత్వం వహించనున్నారు. ఇలా పలు సినిమాలతో బిజీగా ఉన్న సమంత తాజాగా అరుదైన ఫీట్ సాధించింది. ఇన్స్టాగ్రామ్లో 20 మిలియన్ల ఫాలోవర్స్ మార్క్ను అధిగమించింది సామ్. నాగ చైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత సమంత సాధించిన అరుదైన ఫీట్ ఇది కాగా, ప్రస్తుతం ఈ విషయం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.