Samantha | కెరీర్ పీక్స్లో ఉండగా ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించడం నిజంగా సాహసం. సమంత అలాంటి సాహసమే చేసింది. ‘ఖుషీ’ తర్వాత ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇప్పుడు మళ్లీ సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నట్టు ప్రకటించింది సమంత. ఏడాది తర్వాత తాను చేయనున్న కమ్బ్యాక్ మూవీ తనకు మళ్లీ గ్రాండ్ ఎంట్రీగా ఉండాలని సమంత భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇటీవల ఈ విషయంపై ముంబయిలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడింది.
‘నా కెరీర్ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడే విరామం తీసుకున్నాను. ఇది నిజంగా నేను చేసిన సాహసమే. కానీ తప్పలేదు. ఆరోగ్యం కంటే కెరీర్ గొప్ప కాదని భావించాను. మళ్లీ భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకూడదనే నేను తీసుకున్న కఠిన నిర్ణయం అది. సినిమాలకైతే దూరంగా ఉన్నాను కానీ, నా అభిమానులకు మాత్రం నేను దూరంగా లేను. ఎప్పటికప్పుడు టచ్లోనే ఉన్నాను. కచ్చితంగా మంచి సినిమాతో వస్తాను. ఇప్పుడున్న సమంత అప్డేట్ వెర్షన్. కొత్తగా ఉంటుంది. మీరే చూస్తారుగా..’ అంటూ అందంగా నవ్వేసింది అందాల సమంత.