ఏ మాయ చేశావే చిత్రంతో ప్రేక్షకులని అలరించిన నాగ చైతన్య, సమంత ఇదే సమయంలో ప్రేమలో పడ్డారు. ముందుగా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారింది. దాదాపు ఏడేళ్ల జర్నీ తర్వాత ఇరు కుటుంబ సభ్యుల పరస్పర అంగీకారంతో పెళ్లికి సిద్ధమయ్యారు. 2017 అక్టోబర్ 6న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లికి పది కోట్లకుపైగా ఖర్చు అయినట్టు సమాచారం.
సమంత, నాగ చైతన్య ఇప్పుడు భార్యభర్తలు కాదు.. ఫ్రెండ్స్లా కూడా లేరని అర్థమైపోయింది. నాగ చైతన్య బర్త్ డే రోజు ఎంతో మంది సెలబ్స్ ఆయనకు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేయగా, సమంత చిన్న పోస్ట్ కూడా పెట్టలేదు. అంటే ఈ ఇద్దరి మధ్య ఎంత దూరం పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. స్నేహితులుగా కొనసాగుతామని చెప్పిన వీరు ఫ్యూచర్లో కలిసి సినిమాలు కూడా చేయరని తాజా పరిస్థితులు చూస్తుంటే అర్ధమవుతుంది.
అక్టోబర్ 2న విడాకుల ప్రకటన చేసిన ఈ జంట అందులో ఎవరి దారిలో వాళ్లం నడవాలనుకుంటున్నాం. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. మాది పదేళ్ల స్నేహబంధం. ఈ డిఫికల్ట్ సమయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దని నాగచైతన్య ప్రకటించారు. మున్ముందు కూడా తమకి సపోర్ట్ చేయాలని కోరారు. చైతూ ట్విట్టర్ ద్వారా, సమంత ఇన్స్టా గ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.