అగ్ర కథానాయిక సమంత కెరీర్లో తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. తళపతి విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో విజయ్ సరసన సమంత నాయికగా నటిస్తున్నది. వీరిద్దరు కలిసి నటిస్తున్న నాలుగో చిత్రమిది కావడం విశేషం.
కథా, పాత్రలపరంగా డిఫరెంట్ ట్రీట్మెంట్తో సినిమాల్ని తెరకెక్కించే దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ సినిమాలో సమంత పాత్రను సరికొత్తగా డిజైన్ చేశారట. నెగెటివ్ షేడ్స్తో సాగే పోలీస్ ఆఫీసర్గా ఆమె పాత్ర వైవిధ్యంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాలో విజయ్ ప్రేయసిగా సమంత నటించడం లేదని, కథానుగుణంగా ఈ జోడీ మధ్య వైరం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం సమంత తెలుగులో శాకుంతలం, యశోద చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది.