టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం ఆధ్యాత్మిక చింతనలో భాగంగా ఉత్తరాఖండ్ (Uttarakhand trip) యాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సమంత రిషికేశ్లో ఓ ఆశ్రమానికి వెళ్లిన సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి చార్ధామ్ యాత్రకు వెళ్లింది సమంత. ఈ ఫొటోను నెట్టింట్లో షేర్ చేయగా వైరల్ అవుతోంది.
యమునోత్రి నుంచి మొదలైన యాత్ర గంగోత్రి మీదుగా కేదార్నాథ్, బద్రీనాథ్ వరకు సాగుతుంది. చార్ధామ్ యాత్రలో భాగంగా హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత శిల్పారెడ్డితో కలిసి ఫొటో దిగింది సామ్. గులాబీ రంగు పంజాబీ డ్రెస్లో కొత్తగా కనిపిస్తోంది సమంత.
నాగచైతన్యతో విడాకుల తర్వాత మనోవేదనలో ఉన్న సమంత మళ్లీ మనుపటిలా ప్రశాంత జీవితాన్ని అలవర్చుకునేందుకు భక్తి మార్గాన్ని ఎంచుకుంది. గతాన్ని మర్చిపోయి త్వరలో ఫుల్జోష్తో తనకెరీర్పై దృష్టి పెట్టాలని ప్లాన్ చేస్తోంది. శాకుంతలంతోపాటు కాతువాకుల రెండు కాధల్ చిత్రాల్లో నటిస్తోంది సమంత. వీటిలో శాకుంతలం షూటింగ్ పూర్తి చేసుకుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Ananya Panday | అనన్యపాండేకు ఎన్సీబీ సమన్లు..ఆర్యన్ కేసుతో లింక్..?
Prithviraj Sukumaran | ప్రభాస్తో ఫైట్ చేయనున్న పాపులర్ స్టార్ హీరో..!
Arha: బన్నీ కూతురిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత