Samantha | గతేడాది సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపి అందరిని షాక్కు గురిచేసింది. ప్రస్తుతం ఆ వ్యాధి నుండి కోలుకుంటుంది. ఎవరి సాయం లేకున్నా ఒంటిరిగా పోరాడుతూ సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ తను సక్సెస్ అని నిరూపించుకుంటుంది. ఈ వ్యాధి కారణంగా గతకొన్ని నెలలుగా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చిన సమంత.. ఇటీవలే ఫ్యామిలీమ్యాన్ రూపకర్తలు తెరకెక్కిస్తున్న ‘సిటాడెల్’ వెబ్సిరీస్ కోసం కెమెరా ముందుకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఎక్కువ శాతం ముంబై పరిసర ప్రాంతాల్లో జరుగుతుందట. ఈ నేపథ్యంలో సామ్ అక్కడ ఓ ఖరీదైన అపార్టుమెంట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.
సిటాడెల్తో పాటు సామ్ మరికొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్లకు కూడా సైన్ చేసింది. అందువల్లే ముంబైలో ఓ ఖరీదైన 3BHK అపార్టెమెంట్ను కొనుగోలు చేసిందట. బాలీవుడ్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఆ అపార్టెమెంట్ ధర అక్షరాల రూ.15 కోట్లు అట. ఇంత కాస్ట్లీ అపార్ట్మెంట్ను ముంబైలో కొనుక్కోవడంతో సామ్ మారోసారి హాట్ టాపిక్ అయింది. ఇక ఇటీవలే సిటాడెల్ నుండి విడుదలైన సామ్ ఫస్ట్లుక్ పోస్టర్కు విశేష స్పందన వచ్చింది స్టైలిష్కాప్గా సామ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
ఇక సామ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ రిలీజ్కు సిద్ధంగా ఉంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ముందుగా మహాశివరాత్రి కానుకగా రిలీజ్ చేయాలని అనుకున్నా.. పఠాన్ జోరు ఇంకా కొనసాగుతుండటంతో విడుదల తేదీని వాయిదా వేసినట్లు తెలుస్తుంది. ఇక దీనితో పాటు విజయ్తో కలిసి ‘ఖుషీ’ మూవీ చేస్తుంది. గతేడాదే రెండు షెడ్యూల్స్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో మూడో షెడ్యూల్ ప్రారంభించనుంది.