తెలుగు, తమిళ భాషల్లో తిరుగులేని ఫాలోయింగ్ను సంపాదించుకుంది అగ్ర కథానాయిక సమంత. ‘ఫ్యామిలీమెన్-2’ సిరీస్ ద్వారా బాలీవుడ్లో సత్తా చాటింది. దక్షిణాది ప్రేక్షకులందరికీ సుపరిచితురాలైన ఈ భామ ఇప్పటివరకు మలయాళ సినిమాలో మాత్రం నటించలేదు. తాజా సమాచారం ప్రకారం సమంత మలయాళ అరంగేట్రానికి రంగం సిద్ధమైందని తెలిసింది. మలయాళంలో సీనియర్ దర్శకుడైన షాజీ కైలాస్ ‘పింక్ పోలీస్’ పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. మహిళా ప్రధాన కథాంశమిది. ఈ సినిమాలో సమంత కథానాయికగా నటించనుందని తెలుస్తున్నది. ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయని..కథతో పాటు తన పాత్రలోని వైవిధ్యం నచ్చడంతో ఆమె ఈ సినిమాకు అంగీకరించిందని అంటున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ ఏడాది చివరలో షూటింగ్ను మొదలుపెట్టబోతున్నారని సమాచారం. ప్రస్తుతం సమంత తెలుగులో ‘యశోద’ ‘శాకుంతలం’ చిత్రాల్లో నటిస్తున్నది.