ఏ మాయ చేశావే చిత్రంతో తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెట్టిన సమంత ఆనతి కాలంలోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మారింది. ఇక చైతూతో మూడు సినిమాలు చేసిన సామ్ చివరికి ఆయనకు భార్యగా మారి అక్కనేని కోడలి ప్రమోషన్ అందుకుంది. పెళ్లైన కొద్ది రోజులకే సమంత తన సోషల్ మీడియా అకౌంట్స్లో తన పేరుని అక్కినేని సమంతగా మార్చుకుంది.
అయితే అప్పటి నుండి అక్కినేని సమంతగా ఉన్న సోషల్ మీడియా ప్రొఫైల్ పేరు కొద్ది రోజుల క్రితం సింపుల్ S గా మారింది. దీంతో అభిమానులలో అనేక సందేహాలు తలెత్తాయి. ఎవరికి నచ్చినట్టు వారు కట్టు కథలు అల్లేశారు.దీనిపై తాజాగా స్పందించింది సమంత. ట్రోల్స్ లేదా వివాదాల గురించి నాకు నచ్చినప్పుడే మాట్లాడతాను. ఇలాంటి విషయాలపై నేను స్పందించాలని అనుకోవడం లేదు.
నాకు వివాదాలు నచ్చవు. ఎవరికైనా వారి స్వంత అభిప్రాయాలకు ఎలా అర్హత ఉంటుందో నేను కూడా నా హక్కుకు అర్హత కలిగి ఉంటుంది కదా. అక్కినేని కుటుంబంలో భాగం కావడం వలన కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు కదా. అసాధారణ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నంత మాత్రాన అభిమానుల కోసమే నేను సినిమాలు చేస్తానని కూడా ఎప్పుడూ చెప్పలేదు. నచ్చినవి చేసుకుంటూ వెళుతున్నాను అని సామ్ తెలిపారు. పదకొండేళ్లుగా నటిగా బిజీగా ఉండడం నాపై ప్రభావం చూపుతున్నందున ఇప్పుడు నటన నుండి విరామం తీసుకుంటానని తెలిపారు సమంత