Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే ఈయన నటించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గాడ్ఫాదర్’ చిత్రం ప్రస్తుతం షూటింగ్ను జరుపుకుంటుంది. ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్టయిన ‘లూసిఫర్’కు రీమేక్గా తెరకెక్కుతుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్లో సల్మాన్ ఖాన్ త్వరలోనే జాయిన్ కానున్నాడు. కజ్రత్లోని ఎన్డీ స్టూడియోస్లో మార్చి 12 నుంచి వీళ్లిద్దరి మధ్య సన్నివేశాలు తెరకెక్కనున్నాయి. నిజానికి జనవరిలోనే వీళ్లద్దరి మధ్య షూటింగ్ జరపాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ చిరంజీవికి కరోనా నిర్ధారణ కావడం, సల్మాన్ టైగర్3 షెడ్యూల్తో బిజీగా ఉండటంతో అప్పుడు కుదరలేదు. ఎట్టకేలకు శనివారం నుంచి వీళ్లిద్దరి మధ్య షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో పోరాట ఘట్టాలతో పాటు కొన్ని ఎమోషనల్ సన్నీవేశాలను దర్శకుడు చిత్రీకరించనున్నాడట. నయనతార ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించనుంది. చిరంజీవి నటిస్తున్న మరో చిత్రం ‘భోళా శంకర్’ సెట్స్ పైన ఉంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరింజీవి సోదరిగా నటిస్తుంది. దీని తర్వాత కేఎస్ రవింద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.