‘షేర్షా’ ఫేమ్ దర్శకుడు విష్ణువర్ధన్తో సల్మాన్ఖాన్ ఓ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని కరణ్జోహార్ నిర్మించబోతున్నారు. కార్గిల్ యుద్ధం నేపథ్యంలో రూపొందించిన ‘షేర్షా’ చిత్రం చక్కటి దేశభక్తి ఇతివృత్తంతో ప్రేక్షకులను మెప్పించింది. సల్మాన్ఖాన్ చిత్రాన్ని కూడా ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది.
దేశభక్తి, యుద్ధం ప్రధానాంశాలుగా విష్ణువర్ధన్ ఈ సినిమా స్క్రిప్ట్ను సిద్ధం చేశారని సమాచారం. పాత్రకు అనుగుణంగా స్లిమ్ అండ్ ఫిట్ లుక్లో కనిపించడానికి సల్మాన్ఖాన్ ప్రత్యేకంగా కసరత్తులు చేస్తున్నారని, ఆయన్ని సరికొత్త అవతారంలో ఆవిష్కరించే చిత్రమిదని చెబుతున్నారు. ఈ నవంబర్లో ఈ చిత్రం సెట్స్మీదకు వెళ్లనుంది. వచ్చే ఏడాది క్రిస్టమస్ సందర్భంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.