ముంబై: బిట్కాయిన్ దూసుకువెళ్తున్న విషయం తెలిసిందే. క్రిప్టోకరెన్సీలకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్.. ఇండియాలోనే తొలి క్రిప్టో టోకెన్ గరిని ఆవిష్కరించారు. క్రిప్టోకరెన్సీ ఫ్లాట్ఫామ్లను ప్రోత్సహించే ఉద్దేశంతో.. బాలీవుడ్ స్టార్ జీఏఆర్ఐని లాంచ్ చేశారు. మైక్రో కాంటెంట్, షార్ట్ వీడియో అప్లికేషన్ చింగారికి చెందినదే గరి. తన ట్విట్టర్ అకౌంట్లో దీని గురించి సల్మాన్ కామెంట్ చేశారు. చింగారిలో గరి టోకెన్ రివార్డు ప్రోగ్రామ్ను ప్రారంభించామని, ఎన్ఎఫ్టీ మార్కెట్ను ఓపెన్ చేసినట్లు సల్మాన్ చెప్పారు. గరి ఎన్ఎఫ్టీ మార్కెట్లో తనకు చెందిన వీడియోలను కొనుగోలు చేసుకోవచ్చు అని ఖాన్ ట్వీట్ చేశారు. గరి క్రిప్టో కరెన్సీని సొలానా బ్లాక్చెయిన్ భాగస్వామ్యంతో తయారు చేస్తున్నారు. చింగారిలో వీడియో కాంటెంట్ను క్రియేట్ చేసేవారికి గరి క్రిప్టో టోకెన్ల రూపంలో డిజిటల్ చెల్లింపులు జరపనున్నారు.