బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’. ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన ‘వీరమ్’కు రీమేక్గా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని సల్మాన్ ఖాన్ ట్విట్టర్లో తెలిపాడు.
‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా ఈద్ కు మీ ముందుకు రాబోతుందంటూ.. సల్మాన్ రాసుకొచ్చారు. అలాగే చిత్రానికి సంబందించిన కొత్త స్టిల్ను పంచుకోగా.. ఈ ఫోటోలో సల్మాన్ ఫార్మల్ వైట్ షర్ట్తో క్లాసీ లుక్లో కనిపించాడు.
ఇక రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల కాగా… టీజర్లో సల్మాన్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ అదుర్స్ అనిపించాయి. ఇంకా టీజర్లో వెంకటేష్, భూమిక బతుకమ్మ పట్టుకుని వస్తూ దర్శనం ఇచ్చారు.
జగపతి బాబు కూడా విలన్గా పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు.