ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘సలార్’ దేశవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు అంతటా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో భారీ ఓపెనింగ్స్ రాబడుతున్నది. ఈ సినిమాను రెండు భాగాలుగా తీయబోతున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ‘సలార్’ సీక్వెల్ టైటిల్ను ‘పార్ట్-1’ చివర్లో రివీల్ చేశారు. మొదటి భాగాన్ని ‘సలార్-పార్ట్-1 సీజ్ఫైర్’ పేరుతో విడుదల చేయగా, రెండో భాగానికి ‘సలార్-2 శౌర్యాంగపర్వం’ అనే పేరును ఖరారు చేశారు. అయితే ఈ సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్లేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. దర్శకుడు ప్రశాంత్నీల్ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్తో చేయబోతున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే ‘సలార్’ సీక్వెల్ను పట్టాలెక్కిస్తారు.