Dadasaheb Phalke International Film Festival 2024 |పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ సలార్ (Salaar). ఇప్పటికే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ చిత్రం వరల్డ్ వైడ్గా రూ.800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం మరో అరుదైన ఘనతను అందుకుంది. ఇండియన్ సినీ చరిత్రలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (డీపీఐఎఫ్ఎఫ్)- 2024’లో ఉత్తమ చిత్రంగా (Film Of the year) ఎంపికైంది. ఈ విషయాన్ని దాదా సాహెబ్ ఫాల్కే నిర్వాహకుల కమిటీ ఎక్స్ వేదికగా అనౌన్స్ చేసింది.
”ఇలాంటి ఒక దృశ్య కావ్యం (ఇతిహాసం) తీసిన గొప్ప టీమ్ కి మా అభినందనలు. మీ ఊహల నుంచి తెర మీద వరకు ఈ ప్రయాణం మీ సమర్థతకు నిదర్శనం”. అంటూ దాదా సాహెబ్ ఫాల్కే టీమ్ రాసుకోచ్చింది.
Salaar: Part 1 – Ceasefire wins the prestigious Film of the Year Award at DPIFF 2024! A cinematic masterpiece that has redefined storytelling, captivated audiences, and now, etched its name in history.
Congratulations to the visionary team behind this epic saga. Your journey… pic.twitter.com/QeeaChEu7t
— Dadasaheb Phalke International Film Festival (@Dpiff_official) February 23, 2024
మరోవైపు ఈ ఫిల్మ్ ఫెస్టివల్కు సంబంధించి అవార్డుల కార్యక్రమం గత మంగళవారం ముంబైలో ఘనంగా జరిగింది. భారత సినీ ప్రముఖులతో పాటు బాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఇక ఈ అవార్డుల్లో గత ఏడాది విడుదలైన ‘జవాన్’, ‘యానిమల్’ చిత్రాలు పోటీ పడ్డాయి. జవాన్లో షారుఖ్ నటనకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోగా.. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన నయనతార ఉత్తమ నటి అవార్డు అందుకుంది. ఇక గతేడాది యానిమల్ సినిమాతో కలెక్షన్ల వర్షం కురిపించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఉత్తమ దర్శకుడిగా నిలిచారు.