Prabhas | ప్రభాస్ మంచి భోజనప్రియుడు.. అలా అని అతనొక్కడే తినడు! తాను ఆస్వాదించే కొత్త రుచులను తన సహనటులకూ రుచి చూపిస్తాడు. అంతేకాదు వాళ్లకు నచ్చిన వంటకాలు ఏంటో తెలుసుకుని వాళ్ల ఇంటికి కూడా పంపిస్తుంటాడు! ప్రభాస్ భోళాతనం గురించి ఇప్పటికే కోలీవుడ్ స్టార్ సూర్య నుంచి బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె వరకు అందరు గొప్పగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాజాగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ప్రభాస్ ఆతిథ్యంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్లో జోరు పెంచిన చిత్ర యూనిట్.. రాజమౌళికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలోనే ప్రభాస్పై పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సలార్ షూటింగ్ సమయంలో ప్రభాస్తో తనకు పెద్ద తలనొప్పి అయిపోయిందన్నాడు. తన ముందు నోరు జారితే ఇక అంతే అంటూ జరిగిందేంటో వివరించాడు.
‘ఒకసారి సలార్ షూటింగ్కి నా భార్య, తొమ్మిదేళ్ల కూతురు వచ్చారు. అప్పుడు నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటని నా కూతుర్ని ప్రభాస్ అడిగాడు. చిన్న పిల్ల కదా ఏవో 20 రకాల ఫుడ్ పేర్లను చెప్పేసింది. తనేదో సరదాగా చెప్పేసింది. కానీ ప్రభాస్ మాత్రం ఆ వంటకాలు అన్నీ తన రూమ్కి పంపించాడు. ఆ రోజు రాత్రి ఆ ఫుడ్ అంతా పెట్టడానికి ఎక్స్ట్రా రూమ్ తీసుకోవాల్సి వచ్చింది. ‘ అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ప్రభాస్ దగ్గరకు వెళ్లి.. ఏంటి సార్ నేనేమైనా చుట్టాలు అందరితో వచ్చానా ఇంత ఫుడ్ పంపించారేంటని అడిగానని కూడా గుర్తు చేసుకున్నారు. నేను, నా భార్య, చిన్న పాప ఉంటేనే ప్రభాస్ అంత ఫుడ్ పంపించాడు.. అందుకే ప్రభాస్ మన పక్కన ఉంటే డైటింగ్ చేయడం అనేది మరిచిపోవాల్సిందే అని అన్నాడు. అయితే అందరితో ఇంత ఫుడ్ తినిపించే ప్రభాస్ మాత్రం అస్సలు తినడని అసలు విషయాన్ని బయటపెట్టాడు. ఏదో ఒక కప్పు రైస్, పప్పు తింటాడని.. మనకు మాత్రం పొట్ట పగిలిపోయేంత వరకు పెడతాడని చెప్పుకొచ్చాడు. అందుకే ప్రభాస్ ఉన్నప్పుడు పొరపాటున కూడా నాకు ఇది ఇష్టమని నోరు జారకూడదని అంటున్నాడు ఈ మలయాళ స్టార్ హీరో. ఒకవేళ పొరపాటున నోరు జారితే.. మనం చెప్పిన ఫుడ్ అంతా ఆ రోజు రాత్రే మన రూమ్కి వచ్చేస్తుందంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు.