Sreeleela | సినిమాలకు సంబంధించి కథానాయికలు చివరి నిమిషంలో మారిపోవడం ఇండస్ట్రీలో చాలా సహజమైన విషయమే. డేట్స్ సమస్యల వల్లే ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. తొలుత ప్రకటించిన నాయిక స్థానంలో మరొకరు వచ్చి చేరడం ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్నది. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం నుంచి కథానాయిక శ్రీలీల తప్పుకునే ఛాన్స్ ఉందని గాసిప్స్ వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో రష్మిక మందన్నను హీరోయిన్గా తీసుకోబోతున్నారని తెలిసింది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ విషయంలో మరో నాయిక సాక్షి వైద్య పేరు కూడా వినిపిస్తున్నది. ఏజెంట్, గాండీవధారి అర్జున చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైందీ భామ. విజయ్దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి చిత్రంలో సాక్షి వైద్యను కథానాయికగా ఖరారు చేసే ఛాన్స్ ఉందని వార్తలొస్తున్నాయి. అయితే ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని, చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వస్తేనే నిజానిజాలేమిటో తెలుస్తున్నాయని అంటున్నారు.