బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం పదవ వారం నడుస్తోంది. గత వారం విశ్వ ఎలిమినేట్ అయ్యి అందరికీ షాక్ ఇవ్వగా, తాజాగా అనారోగ్యం కారణంగా జశ్వంత్ పడాల హౌస్ నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో హౌస్ లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉండగా వీరిలో సింగర్ శ్రీరామచంద్రకు సెలబ్రిటీల సపోర్ట్ గట్టిగా ఉంది.
ఆ మధ్య పాయల్ రాజ్పుత్ శ్రీరామ చంద్రకు తన సపోర్ట్ ఉందని బహిరంగంగా తెలియజేసింది. గ్రాండ్ ఫినాలేలో శ్రీరామ్ టైటిల్ను కైవసం చేసుకోవడానికి తన అభిమానులు ఆయనకు ఓటు వేయాలని కోరింది. ఇప్పుడు ప్రముఖ హిందీ కమెడియన్ భారతీ సింగ్ తన స్నేహితుడైన శ్రీరామ చంద్రకు ఓటు వేయమని తన అభిమానులను అడుగుతూ సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.
ఎంతో పాపులారిటీ ఉన్న సోనూసూద్ కూడా తెలుగు బిగ్బాస్ షో గురించి స్పందించాడు.. ప్రస్తుత సీజన్లో పాల్గొన్న సింగర్ శ్రీరామ్ చంద్రకు తన మద్దతు ఉంటుందని ప్రకటించాడు. ఇక తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రత్యేక వీడియో ద్వారా శ్రీరామ్ చంద్ర అద్భుతంగా గేమ్ ఆడుతున్నట్టు తెలియజేశాడు. పాటలు కూడా బాగా పాడుతున్నాడని, ఆయన కప్ గెలుస్తాడనే నమ్మకం ఉందని తెలియజేశారు.