పుట్టపర్తి సాయిబాబా మహత్యం, విశిష్టతను నేటి తరాలకు తెలియజేయాలనే లక్ష్యంతో సాయివేదిక్ ఫిలింస్ సంస్థ రూపొందిస్తున్న ‘శ్రీసత్యసాయి అవతారం’ చిత్రం గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది. సాయిప్రకాష్ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు. డాక్టర్ దామోదర్ నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి తనికెళ్ల భరణి క్లాప్నివ్వగా, తమ్మారెడ్డి భరద్వాజ కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు సాయిప్రకాష్ మాట్లాడుతూ ‘బాబాగారికి 180 దేశాల్లో భక్తులున్నారు. ఆయనతో సన్నిహితంగా గడిపే అదృష్టం నాకు దక్కింది.
ఈ సినిమాలో నాలుగొందల మంది నటించబోతున్నారు’ అని చెప్పారు. ఈ సినిమాలో తాను మహాలక్ష్మి పాత్రలో నటిస్తున్నానని అర్చన పేర్కొంది. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జె.బి.కృష్ణ, ఎడిటర్: ఈశ్వర్రెడ్డి, ఆర్ట్: నాగు, సహనిర్మాత: గోపీనాథ్రెడ్డి, నిర్మాత: డా॥ బి.దామోదర్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: ఓం సాయిప్రకాష్.