సాయిరామ్శంకర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మంగళవారం హైదరాబాద్లో ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ చిత్రం ద్వారా ప్రకాష్ జూరెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వీఎన్ఆర్ క్రియేషన్స్ పతాకంపై రమణి జూరెడ్డి నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్నందిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘90లో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాం. కథ, కథనాలు ఆసక్తికరంగా ఉంటాయి’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మోహన్ చారి, సంగీతం: మాస్ట్రో ఇళయరాజా, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, దర్శకత్వం: ప్రకాష్ జూరెడ్డి.