శేఖర్కమ్ముల దర్శకత్వంలో వస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లవ్ స్టోరీ. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా వస్తున్న ఈ ప్రాజెక్టు ఏప్రిల్ 16న విడుదల కావాల్సి ఉంది. పవన్ కల్యాణ్ నటించిన ఏప్రిల్ 9న వకీల్సాబ్ విడుదలవుతుండటంతో థియేటర్ల విషయంలో చిక్కులు వచ్చే అవకాశం ఉందని ..ఈ నేపథ్యంలో ఏప్రిల్ చివరికి వాయిదా పడిందని వార్తలు తెరపైకి వచ్చాయి.
కానీ ఈ చిత్రం విడుదలైనట్టు వస్తున్న వార్తలు వట్టి పుకార్లేనని నిర్మాతలు కొట్టి పారేశారు. లవ్స్టోరీ అనుకున్న సమయానికి థియేటర్లలో సందడి చేయనుందని క్లారిటీ ఇచ్చారు. లవ్ స్టోరీ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నారు శేఖర్ కమ్ముల అండ్ టీం. అమిగోస్ క్రియేషన్స్ అండ్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై పీ రామ్మోహన్ రావు, నారాయణ్ దాస్ నారంగ్ నిర్మిస్తున్నారు