‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్ర సమర్పకుడు డా.నాగేశ్వరరావు పూజారి తన సైన్మా స్టూడియోస్ పతాకంపై తొలి ప్రయత్నంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శక, నిర్మాత వేణు ఊడుగుల ఈచిత్రానికి సమర్పకులు. పీవీఎన్ కార్తికేయ దర్శకుడు. ఆదివారం నిర్మాత డా.నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ని రిలీజ్ చేశారు.
ఓ అమ్మాయి కంటినీ.. ఆ కంటిలో సైకిల్పై వెళ్తున్న అన్నాచెల్లెళ్ల ప్రతిబింబాన్నీ ఈ పోస్టర్లో చూడొచ్చు. ‘ఈ ప్రకృతి మనకిచ్చిన స్నేహితుడు సోదరుడు. కానీ ఆ బంధానికి మధ్యలో అహం అనే అడ్డుగోడలను మనమే నిర్మించుకున్నాం’ అంటూ పోస్టర్పై రాసిన క్యాప్షన్ చిత్ర కథపై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నది. త్వరలోనే ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనున్నదని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.