బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ .. అమృత సింగ్ నుండి విడిపోయి కరీనా కపూర్ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్ కు అమృత సింగ్ తో ఇద్దరు పిల్లలు సంతానం కాగా, వారి పేర్లు సారా అలీ ఖాన్, ఇబ్రహీం అమృత సింగ్. ఇక కరీనాని 2012లో పెళ్లి చేసుకున్న సైఫ్.. తైమూర్, జహంగీర్ అనే ఇద్దరు చిన్నారులకి జన్మనిచ్చారు. అయితే సైఫ్ ప్రస్తుతం బంటీ ఔర్ బబ్లీ 2 చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.
తాజాగా కపిల్ శర్మ కోసం రాణీ ముఖర్జీతో కలిసి హాజరైన సైఫ్.. అదిరిపోయే పంచ్ వేసి అందరిని నవ్వించాడు. మీకు పనిమీద ప్రేమ ఎక్కువై ఇలా వరుసగా సినిమాలు చేస్తున్నారా ? లేక పిల్లలు పుడుతుండడం, ఫ్యామిలీ బాధ్యతల వల్ల సినిమాలు చేస్తున్నారా అని కపిల్ ప్రశ్నించాడు. దీనికి సైఫ్ సమాధానం ఇస్తూ.. ‘ ఫ్యామిలీ కోసం కాదు కానీ.. ఇంట్లోనే ఉంటే ఇంకా ఎక్కువ మంది పిల్లలు పుడతారేమో అని భయంగా ఉంది.. అందుకే వర్క్ తో బిజీ అయిపోతున్నా’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వీడియో వైరల్గా మారింది.
సైఫ్ ప్రస్తుతం తాండవ్, భూత్ పోలీస్, బంటీ ఔర్ బబ్లూ 2 ఇలా వరుస సినిమాలతో అలరిస్తుండడంతో కపిల్ అలాంటి ప్రశ్న సంధించాడు. ఈ ప్రశ్నకి సైఫ్ ఇచ్చిన సమాధానం అందరు ఘొల్లున నవ్వేలా చేసింది. ఇదిలా ఉండగా ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు రానుంది.