బాలీవుడ్ నటులు దక్షిణాది చిత్రాల్లో ప్రతినాయకుల పాత్రల్లో రాణించడం కొత్తేమీ కాదు. ‘కేజీఎఫ్-2’ చిత్రంలో అధీరా పాత్రలో సంజయ్దత్ పండించిన విలనీ అందరిని మెప్పించింది. ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’లో కూడా బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్అలీఖాన్ లంకేష్గా విలన్ పాత్రలో నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం సైఫ్అలీఖాన్ మరో తెలుగు అగ్ర హీరో చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటించడానికి అంగీకరించారని తెలిసింది.
మహేష్బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎస్.రాధాకృష్ణ నిర్మాత. ఇందులో సైఫ్అలీఖాన్ విలన్గా నటించబోతున్నారని తెలిసింది. కథానుగుణంగా శక్తివంతమైన విలన్ క్యారెక్టర్ కోసం దర్శకుడు త్రివిక్రమ్ హిందీ అగ్ర నటుణ్ణి ఎంపిక చేసుకోకవాలనుకున్నారని, చివరకు సైఫ్అలీఖాన్ పేరును ఖరారు చేశారని అంటున్నారు. మహేష్బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ క్రేజ్ దృష్ట్యా ఈ ప్రాజెక్ట్లో భాగం కావడానికి సైఫ్ అలీఖాన్ సుముఖత వ్యక్తం చేశారని సమాచారం.