బాలీవుడ్ క్యూట్ కపుల్స్లో కరీనా కపూర్- సైఫ్ అలీ ఖాన్ జంట ఒకటి. వీరిద్దరు నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తుంటారు. ఇటీవల కరీనా జెహ్ అనే కుమారుడికి జన్మనివ్వగా అంతకముందు తైమూర్ అనే కుమారుడు ఉన్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీ లైఫ్ని ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
ఇటీవల సైఫ్ ఓ ఇంటర్వ్యూకి హాజరు కాగా.. కరీనా సోషల్ మీడియా పోస్టుల గురించి మాట్లాడాడు. `నేను ఏ విషయంలోనూ కరీనాకు సలహాలు ఇవ్వను. వైవాహిక జీవితం సజావుగా సాగాలంటే భార్యాభర్తలు ఒకరి అభిప్రాయాలను మరొకరి మీద రుద్దకూడదు. కరీనా మల్టీ టాస్కర్. అందుకే తన ఏం చేయాలకుంటుందో అది చేస్తుంది. నా కంటే చాలా ఎక్కువ విషయాలు ఆమెకు తెలుసు. అందుకే నేను తనకు అంతగా సలహాలు ఇవ్వను. తను ఏం చేస్తోందో ఆమెకు చాలా క్లారిటీ ఉంటుందని సైఫ్ పేర్కొన్నాడు.
ఇక సినిమాల విషయాని కొస్తే సైఫ్ అలీ ఖాన్ ఆది పురుష్ చిత్రంలో ప్రభాస్ తో తలపడనుండగా.. కరీనా కపూర్ అమీర్ ఖాన్ తో కలిసి లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.