Naga Chaitanya | చందూ ముండేటితో చేయబోయే పాన్ ఇండియా సినిమా కోసం నాగ చైతన్య కాస్త ఎక్కువే కష్టపడుతున్నాడు. ప్రత్యేకించి జాలర్లుతో మాట్లాడటం, వాళ్ల డేయిల్ యాక్టివిటీస్ను తెలుసుకోవడం, బోట్ శిక్షణ వంటివి తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభించనుంది. ఇక ఈ సినిమా నాగచైతన్య కెరీర్లోనే మోస్ట్ ఎక్స్పెన్సీవ్ ప్రాజెక్ట్గా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాకు ‘తండేల్’ అనే పేరును కూడా ఫిక్స్ చేశారట. ఈ సినిమాలో చైతన్య మత్స్యకారుడిగా కనిపించనున్నాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ తెగ వైరల్ అవుతుంది.
ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా సాయి పల్లవిని ఎంపిక చేయాలనుకుంటున్నట్లు ఇన్సైడ్ టాక్. ఇప్పటికే కథా చర్చలు కూడా ముగిసాయట. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే లేటని సమాచారం. ఇప్పటికే వీళ్ల కాంబోలో వచ్చిన లవ్స్టోరీ సూపర్ డూపర్ హిట్టయింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో వీళ్ల కెమెస్ట్రీ అద్భతంగా కుదిరింది. దాంతో ఇదే జోడీని మళ్లీ రిపీట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది.
గీతా ఆర్ట్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు అనిరుధ్ స్వరాలందించబోతున్నట్లు టాక్. ఇక ఈ సినిమా మొత్తం జాలరుల చుట్టూ తిరుగుతుందట. శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారులు ఉపాధి కోసం గుజరాత్ వెళ్లి అక్కడ అనుకోకుండా ఓ సంఘటనలో చిక్కుకుంటారు. మరీ దాంట్లోనుంచి వాళ్లు బయటకు వచ్చారా? తిరిగి వాళ్ల కుటుంబాలను కలుసుకున్నారా అనే కాన్సెప్ట్తో తెరకెక్కబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కబోతుంది.