Virata Parvam Ott Release Date | రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఊడుగుల దర్శకత్వం వహించాడు. ఎన్నో వాయిదాల తర్వాత జూన్ 17న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరుచూపించలేకపోయింది. పోటీగా ‘విక్రమ్’, ‘అంటే సుందరానికీ’ చిత్రాలు ఉండటం.. ఈ రెండు బాక్సాఫీస్ దగ్గర బాగా పర్ఫార్మ్ చేయడం, విరాటపర్వం కలెక్షన్లకు తీవ్ర దెబ్బ పడింది. కలెక్షన్ల విషయం పక్కన పెడితే ఈ చిత్రంలో రానా, సాయి పల్లవిల నటన వర్ణనాతీతం. రవన్న, వెన్నెల పాత్రల్లో ఒదిగిపోయారు. వేణు దర్శకత్వ ప్రతిభను ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రం జూలై 1నుండి స్ట్రీమింగ్ కానుంది. అంటే సినిమా విడుదలైన రెండు వారాల్లోపే డిజిటల్లోకి వస్తుంది. ఈ మధ్య కాలంలో ఇంత తొందరగా ఏ సినిమా ఓటీటీలో విడుదల కాలేదు. కాగా ఈ చిత్రం ఇప్పటివరకు సాధించిన కలెక్షన్లు బడ్జెట్లో సగం వరకు కూడా రికవరీ చేయలేక పోయింది. దాంతో ముందు అనుకున్న దానికింటే ఎక్కవ రేటుకు నెట్ఫ్లిక్స్తో డీల్ కుదిరించుకొని మేకర్స్ ఇంత త్వరగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. గురువారం అర్ధరాత్రి 12గంటల నుండి ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.ప్రియమణి, నవీన్ చంద్ర, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థతో కలిసి రానా దగ్గుబాటి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.