‘రామాయణ’ చిత్రం ద్వారా బాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తున్నది అగ్ర కథానాయిక సాయిపల్లవి. రణబీర్కపూర్ రాముడి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి నితేష్ తివారి దర్శకుడు. ఈ సినిమాలో సీత పాత్రను పోషించడం అదృష్టంగా భావిస్తున్నానని సాయిపల్లవి ఆనందం వ్యక్తం చేసింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘చిన్నప్పటి నుంచి రామాయణం వింటూ పెరిగాను. సీతమ్మ పాత్రలో నటించే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. నాలోని భయాలన్నింటిని పక్కనబెట్టి సీత పాత్ర కోసం సన్నద్ధమవుతున్నా. ఓ నటిగా కాకుండా భక్తురాలిలా సీత పాత్రలో నటిస్తున్నా. నా కెరీర్లో ఇదొక అపురూపమైన చిత్రంగా నిలిచిపోతుంది’ అని చెప్పింది.