అక్షర శిల్పి సిరివెన్నెల సీతారామశాస్త్రి రీసెంట్గా కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన భౌతికంగా మనకు దూరమైన పాట రూపంలో మన మధ్యే ఉన్నారు. 1986లో ‘సిరివెన్నెల’తో మొదలైన సీతారామశాస్త్రి పాటల ప్రస్థానం.. శ్యామ్ సింగరాయ్తో ముగిసింది. నాని, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన ఈ చిత్రంలో సిరివెన్నెల రెండు పాటలు రాశారు. సిరివెన్నెల రాసిన చివరి పాటను మంగళవారం విడుదల చేసింది చిత్ర బృందం.
సిరివెన్నెల చివరి పాట అంటూ చిత్ర బృందం పాటను విడుదల చేయగా, ఈ పాట సిరివెన్నెల అంటూ సాగింది.ఈ పాట శ్రోతలని ఎంతగానో ఆకట్టుకుంటుంది. సిరివెన్నెల పదాల్లోని మ్యాజిక్ను ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. ఈ పాట గురించి సాయిపల్లవి ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. ‘మీరు రాసిన ప్రతి పదం మీ ఆత్మను తీసుకు వస్తోంది. ఎప్పటికీ మీరు మా హృదయాల్లో జీవించే ఉంటారు సార్’ అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం సాయి పల్లవి ట్వీట్ వైరల్గా మారింది. ఇక శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.