ప్రతిభ గల నటిగా, మంచి డ్యాన్సర్గా తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో పేరు తెచ్చుకుంది సాయి పల్లవి. గ్లామర్కు ప్రాధాన్యత ఇవ్వకుండా కథలో కీలకమైన పాత్రల్లో నటిస్తూ నాయికగా తన ప్రత్యేకత చాటుకుంది. గతేడాది ‘విరాటపర్వం’, ‘గార్గి’ చిత్రాల్లో కనిపించిన సాయి పల్లవి..ఆ తర్వాత కొత్త చిత్రాలేవీ ప్రకటించలేదు. సినిమాల విషయంలో ఈ తార ఎంపికగా ఉండటమే ఇందుకు కారణమని చెప్పుకోవచ్చు.
ఇక ప్రస్తుతం సాయి పల్లవి గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఎన్టీఆర్ కొత్త సినిమాలో ఆమె ఓ ప్రధాన పాత్రను పోషిస్తున్నది అనేది ఆ వార్తల సారాంశం. ఈ చిత్రంలో ఇప్పటికే జాన్వీ కపూర్ నాయికగా ఎంపికైంది. మరో హీరోయిన్ క్యారెక్టర్ కోసం చిత్రబృందం సాయి పల్లవిని సంప్రదించిందట. ఈ చిత్రంలో సాయి పల్లవితో ఓ డ్యూయెట్ చిత్రీకరిస్తే ఆమె మాస్ స్టెప్పులు సినిమాకు ఆకర్షణ అవుతాయని ఆశించవచ్చు. ప్రస్తుతం సాయి పల్లవి తమిళంలో శివకార్తికేయన్ సరసన ఓ చిత్రంలో నటిస్తున్నది.