ప్రస్తుత రాజకీయాలపై తెరకెక్కిన రాజకీయ వ్యంగ్యచిత్రం ‘లక్ష్మీకటాక్షం’. ‘ఫర్ ఓట్’ అనేది ఉపశీర్షిక. సూర్య దర్శకుడు. యు.శ్రీనివాసులరెడ్డి, బి.నాగేశ్వరరెడ్డి, వహీద్ షేక్, కె.పురుషోత్తం రెడ్డి నిర్మాతలు. ప్రస్తుతం సినిమా నిర్మాణంలో ఉంది. మూవీ ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాకు చెందిన డైలాగ్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. సాధారణంగా రాజకీయనాయకులు ఓటుకి ఇంత డబ్బు అని నిర్ణయిస్తారు.
కానీ ఈ డైలాగ్ పోస్టర్లో ఓటర్ అనేవాడు తన రేటును తానే నిర్ణయించుకుంటాడు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలకి అద్దం పట్టేలా ఈ డైలాగ్ పోస్టర్ డిజైన్ చేయడం జరిగిందని, తాడిపత్రి నేపథ్యంలో చిత్రీకరణ జరిపామని, త్వరలో టీజర్నూ, ట్రైలర్నూ విడుదల చేస్తామని దర్శక, నిర్మాతలు తెలిపారు. సాయికుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో వినయ్, అరుణ్, దీప్తి వర్మ ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: నని ఐనవెల్లి, సంగీతం: అభిషేక్ రుపుస్.