SDT17 | సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో వీర లెవల్లో కంబ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత బ్రో కాస్త నిరాశపరిచిన మేనమామ పవన్తో కలిసి స్క్రీన్ పంచుకున్న ఆనందాన్నైతే ఇచ్చింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో సంపత్ నందితో మాస్ సినిమా కోసం చేతులు కలిపాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. ఇక నిన్న రిలీజైన ప్రీ లుక్పోస్టర్ను మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సాయిధరమ్ తేజ్ బర్త్డే సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ను రిలీజ్ చేశారు.
చిన్నప్పుడే స్కూల్ ఎగ్గొట్టేసి.. అమ్మానాన్నల మాటను పెడచెవిన పెట్టి.. అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతూ.. అన్ని చెడు అలవాట్లను ఒంటికంటించుకుని.. పది రూపాయలుంటే పార్కులో.. పది వేలుంటే పార్క్ హయత్లో ఉండే ఒక అల్లర చిల్లరగా పెరిగిన మనిషి గాంజా శంకర్. అలాంటి మనిషి కథ ఎలా ఉండబోతుంది అన్న కాన్సెప్ట్తో గ్లింప్స్ను వదిలారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ ఊరమాస్ను చూడబోతున్నాం అన్న క్లారిటీ అయితే వచ్చేసింది. ఎలాగూ సంపత్ నందికి కమర్షియల్ సబ్జెక్ట్ను డీల్ చేయడంలో పట్టుంది.
పైగా త్రివిక్రమ్ ప్రొడ్యూసర్ కాబట్టి అన్నీ దగ్గరుండి చూసుకుంటాడు. ఇంకేముందు అన్ని కలిసొస్తే సాయి ధరమ్తేజ్కు మాస్ ఆడియెన్స్లో యాక్సెప్టెన్స్ దొరికినట్లే. గ్లింప్స్తో పెద్దగా అంచనా వేయిలేం కానీ.. టీమ్ను చూస్తే మాత్రం సినిమా పెద్ద స్కేల్లోనే తెరకెక్కబోతుందని తెలుస్తుంది. సితార సంస్థతో కలిసి త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్పై గాంజా శంకర్ను నిర్మిస్తుంది. ధమకా, బలగం సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న భీమ్స్ ఈ సినిమాకు స్వరాలు అందించబోతున్నాడు. సాయితేజ్కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించనున్నట్లు సమాచారం.